చైనా రాజకీయ సలహాదారు జావో జోంగ్కీని పదవినుండి తొలగించింది. డోక్లామ్, గల్వాన్ సరిహద్దు వివాదాలకు ఆయన నాయకత్వం వహించారు. జిన్పింగ్ భారత పర్యటనకు ముందు ఈ చర్య చేపట్టారు. క్రమశిక్షణ ఉల్లంఘనలకు మరో ఇద్దరు జనరల్స్నూ తొలగించారు. China President Xi Jinping India Visit | బీజింగ్: చైనాలోని జీ జిన్పింగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ సలహాదారు పదవిలో ఉన్న జనరల్ జావో జోంగ్కీని చైనా ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించింది. డోక్లామ్ సరిహద్దు వివాదం, 2020లో భారత్తో గల్వాన్ లోయ ఘర్షణ సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్టర్న్ థియేటర్ కమాండ్కు జనరల్ జావో జోంగ్కీ నేతృత్వం వహించారని తెలిసిందే. గల్వాన్ లోయలో సరిహద్దు వెంట భారత ఆర్మీపై దాడికి కమాండ్ ఇచ్చింది జావో జోంగ్కీనే. చైనా అధ్యక్షుడు రెండు వారాల్లో భారత్లో పర్యటించనున్నారని వార్తలు వస్తున్న సమయంలో జీ జిన్ పింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 12, 13 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరు కానున్నారని సమాచారం. PLA వెస్టర్న్ కమాండ్ టిబెట్, షిన్జియాంగ్లో, భారత్తో చైనా సరిహద్దులోని పెద్ద భాగంలో చైనా సైనిక ఆపరేషన్లను నియంత్రిస్తుంది. రాయిటర్స్ను ఉటంకిస్తూ ఈ వార్త విడుదలైంది. భారత్కు గుణపాఠం చెబుతామంటూ గల్వాన్ లోయలో ఆపరేషన్కు జనరల్ జావో ఆర్డర్ ఇచ్చారని వైరల్ అవుతోంది. కాన్ఫరెన్స్ సభ్యత్వం తొలగింపు, మరో రెండు పదవుల నుంచి తొలగింపు జనరల్ జావోకు చెందిన చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ సభ్యత్వాన్ని తొలగించారు. అంతేకాదు, ఆయనను మరో 2 పదవుల నుంచి కూడా తొలగించారు. చైనా క్రమశిక్షణ, చట్టాల తీవ్రమైన ఉల్లంఘనల కారణంగా మరో ఇద్దరు సీనియర్ జనరల్స్ జాంగ్ యూక్సియా, లియూ జెన్లీని రాష్ట్ర కేంద్ర సైనిక కమిషన్ నుంచి తొలగించింది. 2017లో డోక్లామ్లో చైనా, భారత సైనికులు 72 రోజుల పాటు తలపడినప్పుడు, జావో జోంగ్కీ వెస్టర్న్ కమాండ్కు నాయకత్వం వహిస్తున్నారు. 2020 మే నెలలో తూర్పు లద్దాఖ్లో ఉద్రిక్తత సమయంలో కూడా ఆయన పదవిలో ఉన్నారు. అది తర్వాతి కాలంలో గల్వాన్ ఘర్షణగా మారింది. 2020లో అమెరికా గూఢచారి అంచనాను ఉటంకిస్తూ నివేదిక విడుదల చేస్తూ, భారత్కు గుణపాఠం చెప్పేందుకు గల్వాన్ ఆపరేషన్కు జావో ఆమోదం ఇచ్చారని ANI తెలిపింది. తూర్పు లద్దాఖ్లో గల్వాన్ ఘర్షణ 2020 మే నెలలో జావో పదవీకాలంలోనే ప్రారంభమైంది. ఆ తర్వాత PLA లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్పై అనేక చోట్ల చైనా తమ సైనికులను మోహరించింది. జూన్ 15న గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య రాడ్లు, రాళ్లు స్వదేశీ ఆయుధాలతో ఘర్షణ జరిగింది. విషాదాన్ని నింపిన గల్వాన్ దాడిలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. Frequently Asked Questions రాజకీయ సలహాదారు పదవి నుండి తొలగించబడిన జనరల్ ఎవరు? జనరల్ జావో జోంగ్కీని చైనా ప్రభుత్వం రాజకీయ సలహాదారు పదవి నుండి తొలగించింది. డోక్లామ్, గల్వాన్ ఘర్షణల సమయంలో ఆయన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్టర్న్ థియేటర్ కమాండ్కు నాయకత్వం వహించారు. గల్వాన్ లోయలో భారత ఆర్మీపై దాడికి కమాండ్ ఇచ్చింది జావో జోంగ్కీనే అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ తొలగింపు జరిగి