చేవెళ్ల: అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్ట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని చేవెళ్ల ఐసీడీఎస్ సీడీపీఓ హెప్సిబా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలోని చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ మండలాల్లో మొత్తం 29 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈనెల 31 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని కోరారు. ఖాళీల వివరాలు, అర్హతలు, నియమ నిబంధనలు, పూర్తి వివరాలకు మహిళా శిశుసంక్షేమశా అధికార వెబ్సైట్ https://wdcw.tg.nic.in ను సందర్శించాలని సూచించారు. అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని కవాడిపల్లి అంగన్వాడీ సెంటర్ –1, 2తో పాటు తారమతిపేటలోని అంగన్వాడీ సెంటర్ –2లో ఉన్న మూడు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హయత్నగర్ సీడీపీఓ వినీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. కుల్కచర్ల: మాలలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాలలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 31న సెక్రటేరియేట్ ముట్టడించేందుకు రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా పరిధిలోని మాలమహానాడు కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) నీకు చేతకాకపోతే చెప్పు.. చంద్రబాబుకు బొప్పరాజు సవాల్ ABN రాధాకృష్ణని ఒక్కటే అడుగుతున్నా జోగి రమేష్ ఫైర్ నీకు టైం దగ్గర పడింది సాయిరెడ్డి... ఎవరిని చూసి రెచ్చిపోతున్నావో మాకు తెలుసు!