RSS chief Mohan Bhagwat: భారత్లో ముస్లింలు ఉండకూడదని భావించేవారు అసలు హిందువులే కారని, ఇది హిందూత్వ ఆలోచనా విధానానికే విరుద్ధమని సర్సంఘచాలక్ మోహన్ భగవత్ తేల్చి చెప్పారు. ప్రపంచంలోని అన్ని మార్గాలు లేదా ధర్మాలు ఆ ఒక్క అంతిమ సత్యం వైపునకే నడిపిస్తాయని, ఇదే హిందూ సాంప్రదాయపు ముఖ్యాంశమని పేర్కొన్నారు. తాజాగా న్యూయార్క్లో జరిగిన 'ఒకే ప్రపంచం, ఒకే మానవత్వం' కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ ప్రసంగించారు. పూజా పద్ధతులు, విశ్వాసాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, అంతిమ సత్యం, మానవత్వం ఒకటేనని స్పష్టం చేశారు