కొత్త ఎల్పీజీ కనెక్షన్లపై కేంద్రం విధించిన నిషేధం దేశంలో ఇంకా కొనసాగుతున్నది. పశ్చిమాసియా యుద్ధం క్రమంలో ఈ ఏడాది మార్చి నుంచి చమురు కంపెనీలు 14.2 కేజీల గృహ సంబంధ కొత్త కనెక్షన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశాయి. అయితే ఇప్పటికే కనెక్షన్లు ఉన్న వారికి నిరాఘాటంగా గ్యాస్ను సరఫరా చేస్తున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నందున ఎల్పీజీ ఆశించిన స్థాయిలో దిగుమతి కావడం లేదని కేంద్రం పేర్కొన్నది