Kaizer News

NEET Students Suicide: కొన్ని గంటల్లో నీట్ పీజీ ఎగ

NEET Students Suicide: కొన్ని గంటల్లో నీట్ పీజీ ఎగ్జామ్.. హైదరాబాద్‌లో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య

· City - Hyderabad · telugu.abplive.com

హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని గంటల్లో నీట్ పీజీ ఎగ్జామ్ ఉండగా ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న అపరాజిత హాస్టల్‌లో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నీట్ పీజీ (NEET PG) పరీక్షకు సిద్ధమవుతున్న యశ్విత అనే ఎంబీబీఎస్ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గత ఆరు నెలలుగా ఆమె హైదరాబాద్‌లోనే ఉంటూ ఈ పోటీ పరీక్ష కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆదివారం (ఆగస్టు 30న) నీట్ పీజీ ఎగ్జామ్ రాయాల్సి ఉండగా.. ఒకరోజు ముందు అభ్యర్థి యశ్విత ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె అయిన యశ్విత, రేపు పరీక్ష జరగనుండటంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. పరీక్షల భయం, మానసిక ఒత్తిడిని తట్టుకోలేకనే ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. యశ్విత ఆత్మహత్యతో ఆ హాస్టల్‌లో తోటి విద్యార్థినులు, అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఒత్తిడిని జయించాలి కానీ, ఇలా ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు శోకం మిగల్చవద్దని అధికారులు, ప్రభుత్వాలు విద్యార్థులకు సూచిస్తున్నాయి. డిప్రెషన్ సమస్య ఉంటే కౌన్సెలింగ్ తీసుకోవాలి, కానీ ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదని చెబుతున్నారు. జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. Up Next Up Next Up Next Up Next ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్ట్ పునరుజ్జీవనానికి తెలంగాణ కీలక అడుగు.. 152 మీటర్లకు ప్రతిపాదన హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ క్రికెట్ వరుస ఓటములకు చెక్ పెట్టేందుకు హర్మన్‌ప్రీత్ సేన సిద్ధం.. థాయిలాండ్‌తో పోరుతో ఆసియా కప్‌లో ఇండియా జ‌ర్నీ షురూ.. అమరావతి ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి.. ముగ్గురు ఉద్యోగులు డిస్మిస్ ప్రపంచం జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు.. గల్వాన్ లోయలో భారత్‌పై దాడికి ఆదేశించడమే కారణమా ? అమరావతి ఏపీని ఐదేళ్లు పాలించింది జగన్ కాదు సజ్జల ముఠా! వైసీపీలో ఆయనే నెంబర్ వన్‌! విజయసాయిరెడ్డి సంచలన లేఖ! ఓటీటీ-వెబ్‌సిరీస్‌ టాక్సిక్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - భారీ ధరకు డిజిటల్, శాటిలైట్ రైట్స్? తిరుపతి మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారా? హైదరాబాద్ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌పై MIM వేటు.. అసదుద్దీన్‌కు దమ్ముంటే కారణం చెప్పాలని రాజా సిం

Original source: telugu.abplive.com
Read more on Kaizer News