Tarnaka: మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ అర్బన్ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు రాగిరి మోహన్ రెడ్డి, రాష్ట్ర యువ మోర్చా మాజీ సభ్యులు అభిషేక్ గౌడ్, నాచారం డివిజన్ ఉపాధ్యక్షులు వీర ప్రతాప్ రెడ్డి, డివిజన్ కార్యదర్శి ఆనంద్ కుమార్, నవీన్, బాలకృష్ణ తదితరులు గిరివర్ధన్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మేడ్చల్ అర్బన్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు