ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఉజ్బెకిస్తాన్లో రెండు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉజ్బెకిస్తాన్ యోగా సమాఖ్య నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యతను ప్రతిబింబించే కార్యక్రమంలో పాల్గొని వివిధ యోగా ఆసనాలు చేశారు. పర్యటనలో భాగంగా అనంతరం ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్తో ప్రధాని మోదీ ప్రతినిధుల స్థాయి చర్చలు నిర్వహించనున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు