Kaizer News

149 మంది భారతీయులు సురక్షితం..

149 మంది భారతీయులు సురక్షితం..

· National - India · prabhanews.com

కి చేరిన మృతుల సంఖ్య 2,500 మందికిపైగా గల్లంతు.. సహాయక చర్యల్లో భారత బృందాలు.. నేపాల్ సైన్యంతో కలిసి గాలింపు.. ఖాట్మాండు, ఆంధ్రప్రభ : నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు మృతుల సంఖ్య 788కి చేరగా, 2,500 మందికిపైగా ఇంకా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. వరదలు సంభవించి ఐదో రోజుకు చేరుకున్నప్పటికీ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న 149 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేర‌కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు 149 మంది భారతీయుల జాబితాను విడుదల చేసింది. అంతకుముందు, నేపాల్‌లో 275 మందికి పైగా భారతీయులు, 128 మంది భారత సంతతికి చెందిన వారు గల్లంతయ్యారని, వారితో సంబంధాలు తెగిపోయాయని భారత ప్రభుత్వం తెలిపింది. తాజా రక్షణ చర్యలతో 149 మంది సురక్షితంగా బయటపడటం వారి కుటుంబాల్లో ఊరటనిచ్చింది. అయితే ఇంకా పలువురి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత సహాయక బృందాలు నేపాల్ సైన్యంతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా చిలిమే, లాంగ్‌టాంగ్ ప్రాంతాల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల వద్ద చిక్కుకున్న వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చేపట్టారు. భారత్‌కు చెందిన సొరంగ రక్షణ బృందం కూడా ఈ సహాయక చర్యల్లో భాగమైంది. క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ సంస్థ తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 9,435 మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి రక్షించారు. మరోవైపు 2,502 మంది ఇంకా గల్లంతయ్యారు. వరదలకు తీవ్రంగా ప్రభావితమైన ఎనిమిది జిల్లాల్లో గాలింపు కొనసాగుతోంది. శిథిలాలు, నదీ పరివాహక ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక బృందాలు మృతదేహాల కోసం కూడా గాలిస్తున్నాయి. చైనా వైపు కూడా ఈ విపత్తు కారణంగా 16 మంది మృతి చెందినట్లు సమాచారం. టిబెట్ ప్రాంతంలో దాదాపు 550 మంది గల్లంతైనట్లు చైనా మీడియా పేర్కొంది. భారీ వర్షాలు, వరదల కారణంగా నేపాల్‌లో కొనసాగుతున్న విషాదం మరింత ఆందోళన కలిగిస్తుండగా, గల్లంతైన వారి కోసం సహాయక బృందాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి

Original source: prabhanews.com
Read more on Kaizer News